సమృద్ధ భారతి రాష్ట్రీయ ట్రస్ట్ సహకారంతో KYF ఆధ్వర్యంలో హైదరాబాద్ సాయి మేధా కోచింగ్ సెంటర్ లో నిర్వహించిన JLM ఉచిత శిక్షణా కార్యక్రమం పూర్తి అయింది. ఈ సందర్భంగా నిర్వహించిన మోటివేషన్ క్లాస్ కు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఎల్లేని సుధాకర్ రావు హాజరైనారు.
శిక్షణ పూర్తి చేసుకున్న 60 మంది ఉద్యోగార్థులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న వాళ్ళందరూ JLM జాబ్ సాధించాలని ఎల్లేని సుధాకర్ రావు ఆకాంక్షించారు. విద్యుత్ రంగంలోని తన అనుభవాలను ఉద్యోగార్థులతో సుధాకర్ రావు పంచుకున్నారు.