అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు.
నాయిని ఆరోగ్యపరిస్థితిపై డాక్టర్లతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చర్చించారు. నాయినికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
ప్రస్తుతానికి నాయిని నర్సింహారెడ్డి కి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయన కోలుకొని వస్తారని ఆశిస్తున్నామని మంత్రి తెలిపారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి మంత్రి ధైర్యం చెప్పారు.
మంత్రి ఈటలతో బాటు కర్నే ప్రభాకర్ కూడా ఉన్నారు.