సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి సారధ్యంలో పట్టణ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ముందుగా స్థానిక శ్రీ వేంకటేశ్వర స్వామి కోవెలలో శానంపూడి సైదిరెడ్డి, పట్టణ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు విశేష పూజలు,అర్చనలు నిర్వహించి పేదలకు పండ్లు పంపిణీ చేశారు.
అనంతరం ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యుడు సైదిరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మొక్కలు నాటారు.
పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి,మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు,పార్టీ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, కౌన్సిలర్లు కొమ్ము శీను,జక్కుల సాంబయ్య,మంగమ్మ, రామగోపి, సౌజన్య ధనుంజయ్,ఫణికుమారి,కెఎల్ఎన్ రావు, కుంట ఉపేంద్ర సైదులు,గాయత్రి భాస్కర్, ఎడ్ల భవాని విజయ్,యారగని గురవయ్య, అమర్ బోయిన గంగరాజు,పార్టీ నాయకులు దొడ్డా నరసింహారావు, నర్సింగ్ వెంకటేశ్వర్లు,మహిళా నాయకురాలు రత్నశ్రీ,దీప,చెవుల కవిత,పుష్ప,విజయ, నాగమణి, స్వప్న, ప్రమీల,నగేష్ రాథోడ్, ఇట్టిమల్ల మధు, మీసాల శరత్,మీసాల కిరణ్ కుమార్,చంద్రమౌళి,ములకలపల్లి రాంబాబు,దొంతగాని బుచ్చిబాబు, కోల్లపూడి దయాకర్,ఎర్రంశెట్టి పిచ్చయ్య, కొట్టు బాబు, కోల శీను,నక్క వెంకన్న, అమరోజు నాగరాజు, మైసయ్య,ప్రేమ్, బాల సైదా, సాయి,ఉపేందర్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్