వ్యక్తిగత సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటీవ్ రావడంతో రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి.హరీష్ రావు హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. సిద్దిపేటలోని ఆయన స్టాఫ్ లో ఒకరికి కరోనా పాజిటీవ్ వచ్చింది. అదే విధంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి కూడా సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు.
ఇటీవల జడ్పీటీసీలు కలెక్టర్ను కలవగా వారి వెంట వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అతడు హైదరాబాద్లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలిసిన కలెక్టర్ సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. మంత్రి హరీశ్ రావుతో పాటు కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్లోకి వెళ్లినట్లు సమాచారం.
లాక్డౌన్ విధించినప్పటి నుంచి మంత్రి హరీశ్ రావు ప్రజలను కరోనా వైరస్ విషయమై చైతన్య వంతుల్ని చేస్తున్నారు. అందరికీ అర్థమయ్యే జాగ్రత్త చర్యలను వివరిస్తున్నారు. నిరంతరం జనంలో తిరుగుతూ వారికి అండగా నిలుస్తున్నారు.