32.2 C
Hyderabad
May 2, 2024 01: 05 AM
Slider ముఖ్యంశాలు

బంజారాహిల్స్ డివిజన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

#Minister Indrakaran Reddy

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా బంజారాహిల్స్ డివిజన్  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గద్వాల్ విజయలక్ష్మి గెలుపు కోసం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇవాళ  ప్రచారం నిర్వహించారు. ప్రేమ్ నగర్ లో  ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు

టీఆర్‌ఎస్ పాలనలో బస్తీలు అభివృద్ధి చెందాయన్నారు. హైదరాబాద్‌లో మంచినీటి సమస్యను పరిష్కరించామని తెలిపారు.

ఓట్ల కోసం బీ బిజెపి, కాంగ్రెస్  చిల్లర రాజకీయాలు చేస్తున్నాయన్నారు.  ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. గత ఆరెండ్లలో హైదరాబాద్ ఎంతో ప్రశాంతంగా ఉందని, బీజేపీ నాయకులు మతం పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీ నేతల వల్లే వరద సాయం ఆగిపోయింది. అర్హులందరికీ వరద సాయం అందిస్తామని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీలో ఎన్నికల్లో టీఆర్ఎస్ ను అత్యధిక స్థానాల్లో గెలిపించి ప్రతిపక్షాలకు బుద్దిచెప్పాలని  పేర్కొన్నారు.

Related posts

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సందర్శకులపై ఆంక్షలు

Satyam NEWS

మండుటెండలో మంత్రి కి బొత్స కు ఎన్.సీ.సీ స్టూడెంట్స్ స్వాగతం అవసరమా…!

Bhavani

యానిమల్:పంక్షన్ లో బాలిక ఫై అత్యాచారం రక్తస్రావం

Satyam NEWS

Leave a Comment