తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన హరితహారం స్పూర్తితో .. పర్యావరణ పరిరక్షణకు మేము సైతం అంటూ హైదరాబాద్ నిజాం పేట కు చెందిన చిన్నారులు చేస్తున్న కృషిని మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు. హైదరాబాద్ నిజాం పేట కు చెందిన చల్ల రాము బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పని చేస్తున్నారు. వారి పిల్లలు దీశీత ( 11 ) సాహర్ష్ (7 ) తమ తల్లిదండ్రులు రాము ప్రవీణ తెచ్చిన మామిడి పండ్లలోని పిక్కలు ,జీళ్ళు తీసి టిష్యూ పేపర్లు, కవర్లలో జాగ్రత్తపడుతూ వచ్చారు… చిన్న చిన్న మొలకలు వచ్చిన తర్వాత వాటిని కప్పుల్లో ప్లాస్టిక్ గ్లాసులు వేసి పెంచడం ప్రారంభించారు వీరిద్దరూ దాదాపు 200 మామిడి పిక్కలను మొక్కలు గా మార్చారు. వారు చేసిన కృషిని మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు.
previous post