తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, టీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గంలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్వచ్చందంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
మొదటగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ మున్సిపల్ కార్యాలయంలో మొక్కలు నాటి, అనంతరం వారి క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. తర్వాత కట్టంగూరు పట్టణ కేంద్రంలో ఆయన మొక్కలు నాటారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు జగదీశ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్ కలిసి నకిరేకల్ మండలంలోని కడపర్తి రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటారు. అనంతరం వారు నార్కట్ పల్లి మండలంలోని బ్రాహ్మణ వెళ్ళెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు వద్ద మొక్కలను నాటి మంత్రి కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ది నరేందర్, నకిరేకల్