సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వార్డులో అనేక చోట్ల నీరు నిలబడి ఉండడంతో వార్డు ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి మున్సిపల్ జెసిబి సహాయంతో పలుచోట్ల గుంతలలో నిలిచి ఉన్న నీటిని ప్రధాన డ్రైనేజీ లోకి మళ్ళించి, డ్రైనేజీ పూడిక తీయించారు.
ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి మాట్లాడుతూ వార్డులో శాశ్వత అభివృద్ధికై సిసి రోడ్లు,డ్రైనేజీలు త్వరలో ప్రారంభోత్సవం చేయనున్నట్లు తెలిపారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్