మంత్రి రోజా గారు ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడు ఆలయంలో సీతారాములవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రోజా కి వేద పండితులు శేషవస్త్రం అందించి వేదాశీర్వచనం చేశారు. సీతారాముల కళ్యాణం వద్దకు చేరుకున్న రాష్ట్ర మంత్రులు రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొట్టు సత్యనారాయణ కి టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమరనాథ రెడ్డి, శాసన సభ్యులు మేడా మల్లిఖార్జున రెడ్డి, జి. శ్రీకాంత్ రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, మారుతి ప్రసాద్ టీటీడీ జెఈవోలు సదా భార్గవి, వీర బ్రహ్మం ఉన్నారు.
previous post