29.7 C
Hyderabad
May 2, 2024 04: 43 AM
Slider ముఖ్యంశాలు

ఒంటిమిట్ట సీతారాములకు తిరుమల శ్రీవారి కానుక

#tirumala

ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్య కల్యాణం సందర్బంగా తిరుమల నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి బుధవారం కానుకలు పంపారు. శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో  భాగంగా బుధవారం రాత్రి  కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ  శుభ సందర్బంగా  360 గ్రాముల బరువు గల బంగారు పతకం, కౌస్తుభం ఆభరణాలను కానుకగా అందించారు.

టీటీడీ  అనుబంధ ఆలయాల్లో బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి కానుకలు పంపడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం ఈ ఆభరణాలు సమర్పించారు. ఆలయం ముందు ఈవో  ఎవి ధర్మారెడ్డి ఆభరణాలకు పూజలు చేసి కోదండరామునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో  జేఈవో లు సదా భార్గవి, వీరబ్రహ్మం ,ఆలయ డెప్యూటీ ఈవో నటేశ్ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

సామిల్ & టింబర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

మిరప మొక్కలు అందిస్తున్న ఎమ్మెల్యే ఏలూరి

Satyam NEWS

ఒక వేణువు ఆగింది

Satyam NEWS

Leave a Comment