తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు భద్రత ను పెంచారు. ఇటీవల ఆయనను హత్య చేసేందుకు కొందరు చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ నేపధ్యంలో ఆయనకు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించాలని ప్రభుత్వం విర్ణయం తీసుకున్నది . ముఖ్యమంత్రి కేసిఆర్ తో పాటు శ్రీనివాస్ గౌడ్ డిల్లీ , జార్ఖండ్ పర్యటనలో వున్నారు. ఆయన హైదరాబాద్ చేరుకోగానే కొత్త గా ఏర్పాటు చేసిన భద్రత అమలులోకి రానున్నది . గతంలో ఒక పైలట్ వాహనం తో పాటు 10 మందిపోలీసు లు భద్రత గా వుండేవారు . ఇప్పుడు 2 పైలట్ వాహనాల తోపాటు 20 మంది పోలీసు లు భద్రత గా వుండనున్నారు .
previous post