28.7 C
Hyderabad
April 28, 2024 06: 00 AM
Slider ముఖ్యంశాలు

రాష్ట్రంలో 5 పామాయిల్ పరిశ్రమల స్థాపనపై మంత్రి తుమ్మల తొలి సంతకం

#tummala

రాష్ట్రంలో పామాయిల్ సాగుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని..ఆయిల్ పామ్ సాగు రైతు జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతాంగం ఆయిల్ పామ్ సాగువైపు మొగ్గుచూపేందుకు అధికార యంత్రాంగం దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత,జౌళి శాఖల మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే తుమ్మల నాగేశ్వరారవు మూడు కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొత్తం 5 ఆయిల్ పామ్ పరిశ్రమలు నెలకొల్పే దస్త్రంపై మంత్రి తొలి సంతకం చేశారు. రూ.1050 కోట్లతో 5 పామాయిల్ పరిశ్రమలు స్థాపించే ఫైలుపై మంత్రి తొలి సంతకం చేశారు. రాష్ట్రంలోని 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేలా  రూ.4.07కోట్లతో సాంకేతిక పరిజ్ఞానంతో రైతు వేదికల్ని తీర్చిదిద్దేందుకు రెండో సంతకం చేశారు.

ఈ రైతు వేదికల్లో రైతులకు పంటల సాగులో అత్యాధునిక సాగుపద్దతులపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. వ్వయసాయశాస్త్రవేత్తలతో రైతులకు తరచూ అవగాహన సదస్సులు నిర్వహించేందుకు వీలుగా రైతు వేదికల్ని తీర్చిదిద్దుతామన్నారు.సహకార వ్యవస్థలో పారదర్శకమైన పాలన అందించేందుకు గానూ వివిధ విభాగాలను పూర్తిగా కంప్యూటరీకరణ చేసేందుకు అవసరమైన చర్యల కోసం మంత్రి మూడో దస్త్రంపై సంతకం చేశారు.

రాష్ట్రంలోని సహకార కమిషనర్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీలతోపాటు జిల్లా సహకార కార్యాలయాల్లో అన్ని రకాల కార్యకలాపాలను కంప్యూటరీకరించాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా గద్వాల కు చెందిన పట్టు పరిశ్రమ శాఖ అధికారి జగన్నాథ్ కుమారుడు ఆశిష్ కుమార్ కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధికారులతో తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రం లో వచ్చే ఐదేళ్ల లో ఏడాదికి ఒకటి చొప్పున పామాయిల్ పరిశ్రమలను ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నెల కొల్పుతామన్నారు.

పామాయిల్ సాగు విస్తరణకు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లుల స్థాపన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి తుమ్మల అన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పంట  సాగు కు అనుకూలంగా ఉన్నాయన్నారు. పామాయిల్ సాగు రైతు మూలధన పెట్టుబడి పెంచుతుందన్నారు. ఉపాధి కల్పన పెంచడంతోపాటు దిగుమతులపై ఆధారడటాన్ని తగ్గిస్తుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోకుండా తెగుళ్ల దాడుల ప్రమాదాలను తగ్గించడం వంటివి పామాయిల్ సాగులోనే సాధ్యమవుతుందన్నారు.

సుమారు 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడినిచ్చే దీర్ఘకాలిక పంటగా రైతుకు స్థిరమైన ఆదాయం ఇస్తుందన్నారు. ముడి పామాయిల్ శుద్ధిచేసిన నూనెల ఉత్పత్తి రాష్ట్రానికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పన్ను ప్రయోజనాలు అందిస్తుందని పేర్కొన్నారు. పామాయిల్ ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుతో రైతులకు ఎళ్లవేళలా మార్కెట్ అందుబాటులోకి వస్తుందని తద్వారా..రైతుకు దక్కాల్సిన సొమ్ము చెల్లింపులు త్వరితగతిన పూర్తవుతాయన్నారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే పామాయిల్ సాగుతో రైతులు ఎకరాకు రూ. లక్ష వరకు ఆదాయం సమకూరుస్తుందన్నారు.

ఇంకా అంతరపంటలతో అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. పరిశ్రమల స్థాపనతో ప్రతీ జిల్లాలో ప్రత్యక్ష, పరోక్షఉపాధి సృష్టించవచ్చన్నారు. టీఎస్ ఆయిల్ ఫెడ్ 2023-24 నుంచి ఏటా 40 వేల ఎకరాల విస్తీర్ణం పెంచేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.పామాయిల్ సాగు రైతు జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని..రైతాంగం ఆయిల్ పామ్ సాగువైపు మొగ్గుచూపేందుకు అధికార యంత్రాంగం దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

Related posts

అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యతిరేకుల పైన రాజద్రోహం కేసు పెట్టాలి

Satyam NEWS

గ‌ట్ట‌మ్మ త‌ల్లిని ద‌ర్శించుకున్న మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

Satyam NEWS

రిపోర్టర్ సురేష్‌ను ప‌రామ‌ర్శించిన జడ్పీ చైర్మన్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు

Satyam NEWS

Leave a Comment