39.2 C
Hyderabad
April 30, 2024 20: 32 PM
Slider విజయనగరం

రిపోర్టర్ సురేష్‌ను ప‌రామ‌ర్శించిన జడ్పీ చైర్మన్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు

#vijayanagaramzpchairmen

ఇటీవ‌ల‌ అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఓ ప్రైవేటు హాస్ప‌ట‌ల్ లో  చేరిన‌  రిపోర్ట‌ర్ సురేష్ శ‌ర్మ‌ను విజయనగరం జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు నేడు ప‌రామ‌ర్శించారు. స్థానిక తిరుమ‌ల ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న సురేష్ కి జేడ్పీ చైర్మన్ ధైర్యం చెప్పారు. ఆయన ఆరోగ్య ప‌రిస్థితిపై డాక్ట‌ర్ తిరుమ‌ల ప్ర‌సాద్‌, ఇత‌ర‌ వైద్యుల‌తో చ‌ర్చించారు. మ‌రింత మెరుగైన వైద్యాన్ని అందించాల‌ని సూచించారు.

సురేష్ కుటుంబ స‌భ్యుల‌తో, పాత్రికేయుల‌తో మాట్లాడారు…జేడ్పీ చైర్మ‌న్. తాను అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు. తక్షణం  సురేష్ కుటుంబ స‌భ్యుల‌కు రూ.25వేల ఆర్థిక సాయాన్ని అంద‌జేశారు. జెడ్‌పి ఛైర్మ‌న్‌తోపాటు, జిల్లా స‌మాచార‌, పౌర సంబంధాల‌శాఖ స‌హాయ సంచాల‌కులు డి.ర‌మేష్‌, కూడా సురేష్‌ను ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడి, వైద్య స‌హాయంపై ఆరా తీశారు. అవ‌స‌ర‌మైన స‌హ‌కారాన్ని అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎడి ర‌మేష్‌తో పాటు సీనియ‌ర్ పాత్రికేయులు బూరాడ శ్రీ‌నివాస‌రావు, జి.కోటేశ్వ‌ర్రావు, బి.నాగేంద్ర‌ప్ర‌సాద్‌, ఎంఎంఎల్ నాయుడు, శేఖ‌ర్‌, శేష‌గిరి, రాజేంద్ర‌కుమార్‌, వీడియో జ‌ర్న‌లిస్టులు శ్రీ‌నివాస‌రావు, సురేష్‌, శ్రీ‌ను త‌దిత‌రులు పాల్గొన్నారు. జ‌ర్న‌లిస్టుకు అండ‌గా నిలిచిన‌దుకు జెడ్‌పి ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావుకు వారు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Related posts

టీడీపీ నుంచి వచ్చారు టీడీపీ లో చేరారు….

Satyam NEWS

మర్డర్ ప్లాన్ ఇచ్చిన పోలీసోడు: రాసలీలల కథకు ముగింపు

Satyam NEWS

అర్ధరాత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క ధర్నా

Satyam NEWS

Leave a Comment