టిఆర్ఎస్ నాయకుడు చిన శ్రీశైలం యాదవ్ రెండవ కుమారుడి వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. చిన శ్రీశైలం యాదవ్ రెండవ కుమారుడు ప్రవీణ్ కుమార్ యాదవ్, మజిత శ్రీ లను వచ్చిన అతిధులు ఆశీర్వదించారు. యూసుఫ్ గూడా పోలీసు మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు టిఆర్ఎస్ పార్టీ నేతలు విచ్చేశారు.
అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూడా పెద్ద ఎత్తున హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నగరానికి చెందిన రాజకీయ నాయకులు అందరూ హాజరు కావడంతో కార్యక్రమం సందడిగా సాగింది.
రాజకీయ నాయకులతో బాటు పలువురు పెద్దలు వచ్చి వారిని ఆశీర్వదించారు. కార్యక్రమానికి విచ్చేసిన అందరికి చిన శ్రీశైలం యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.