సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు సీనియర్ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ కు కరోనా సోకింది. ఆయనను తక్షణమే ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆయనకు ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన కుమారుడు సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ లో వెల్లడించారు.
గురుగావ్ లోని మేదాంతా ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. సీనియర్ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.