ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాఫియా లు రాజ్యం ఏలుతున్నాయని అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గింది. తగ్గాల్సింది ఏదైనా వుందంటే లోకల్ మాఫియాలు మాత్రమే అని ఆయన అన్నారు. ఈ మాఫియాల్లో పోలీసు శాఖ వాళ్ళు కూడా కలిసి ఉన్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల్లో పోలీసులపై ఒక న్యాయం చేస్తారని నమ్మకం, భరోసా ఉంది…అయితే పోలీసులే మాఫియాల్లో కలిస్తే… దేశంలో, రాష్ట్రంలో సామాన్యులకు భద్రత ఉండదు… అని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలంటే, కలుపు మొక్కలను తీసివేయాలని ఎమ్మెల్యే ఆనం అన్నారు.
previous post