పాలకుల మెప్పు కోసం బూటకపు సవాల్ విసిరి తోక ముడిచిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రజాస్వామ్య వ్యవస్థకు క్షమాపణ చెప్పాలని కొల్లాపూర్ తాలూకా రేవంత్ రెడ్డి యువసేన అధ్యక్షుడు డీకే మాదిగ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పదవి గువ్వల బాలరాజు కు ఆయన తల్లిదండ్రులు ఇచ్చిన వారసత్వం కాదని డీకే మాదిగ అన్నారు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బాలరాజు సవాల్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగాన్ని గువ్వల బాలరాజు అవమాన పరిచారని ఆయన అన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ వల్ల ఆయన ఎమ్మెల్యే అయ్యారని అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకుని అచ్చంపేట నియోజకవర్గం ప్రజలకు సేవ చేయలన్నారు. అంతే కానీ ఆవేశాలకు పోకూడదని డికె మాదిగ సూచించారు. ఆవేశాలకు పోతే ప్రతిపక్షాలు వురుకోవన్న సంగతి మరచి పోవద్దన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలతో వేరే విధంగా మాట్లాడుకోవాలి కానీ చాలెంజ్ లు విసరడం పద్ధతి కాదన్నారు. తాను విసిరిన సవాల్ ను వెనక్కి తీసుకుంటున్నానని అచ్చంపేట లో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు నిలబడి భారత రాజ్యాంగానికి క్షమాపణ చెప్పాలన్నారు. అప్పుడే మిమ్మల్ని అచ్చంపేట ప్రజలు క్షమిస్తారన్నారు.