హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలోని చర్లపల్లి చెరువు వద్ద త్వరలోనే సూర్య భగవానుడి దేవాలయం నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు.
చర్లపల్లి చెరువు వద్ద బుధవారం రాత్రి వేలాది మంది బీహార్ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్న చత్ పూజ లో మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి చత్ పూజా వేడుకలలో పాల్గొన్నారు.
పూజా వేడుకలలో నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, డప్పు గిరిబాబు, చర్లపల్లి కాలనీల సమాఖ్య CCS ప్రతినిధి ఎంపల్లి పద్మా రెడ్డి, జౌండ్ల ప్రభాకర్ రెడ్డి, ఎచ్చెర్ల పుష్పలత, రాధాకృష్ణ, శ్రీధర్, గంప కృష్ణ,, కరీం, ఉపేందర్, మహమ్మద్, అజయ్ కుమార్ ,అంజి బీహార్ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.