మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయ మని మాజీ జిహెచ్ఎంసి స్టాడింగ్ కౌంసిల్ మెంబర్, మాజీ బి ఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి గొల్లూరి అంజయ్య అన్నారు. బుధవారం స్వాతంత్ర్య సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి ఉత్సవాలు బషీర్ బాగ్ ఎల్.బి. స్టేడియం లో ఘనంగా జరిగాయి. ఈ జయంతి ఉత్సవాల్లో రాష్ట్ర ఎం ఆర్ పి ఎస్ ప్రెసిడెంట్ మేడి పాపయ్య, యుద్ద నౌక గద్దర్ తో కలిసి మాజీ కార్పోరేటర్ గొల్లూరి అంజయ్య బషీర్ బాగ్ వద్ద ఉన్న ఆమహానియుడి విగ్రహానికి పూల మాలను వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వంజరి సంఘం ఆర్గనైజిగ్ సెక్రటరీ వంజరి ప్రవీణ్, ఉప్పల్ మేరు సంఘం అధ్యషుడు రుద్రాంగి కర్ణాకర్, మారుతీ రావు, చింటూ, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా