సీఎం కాన్వాయిలా…దాదాపు 15 కార్లతో రెండు ప్రదేశాలను సందర్శించిన డిప్యూటీ స్పీకర్….!
భారీ కాన్వాయి..దాదాపు 15 కార్లు…వెంట సగానికి సగం మంది కార్పొరేటర్లు…కేవలం ఒకే ఒక్క గన్ మేన్.ఈ మంది మార్బలం ఎవరదిని అనుకుంటున్నారా..? మరికొద్ది గంటలలో ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా ప్రమాణం చేయబోతున్న…విజయనగరం ఎమ్మెల్యే…అలాగే వైఎస్ఆర్పీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామిది.
ఇన్ని వెహికిల్స్…అంతమంది కార్పొరేటర్లతో…ఎక్కడికెళ్లారనేగా మీ సందేహం..అక్కడికే వస్తున్న…మొన్నీమధ్యనే ప్రతిపక్ష పార్టీ టీడీపీ అటు ముషిడిపల్లి, ఇటు రామతీర్దం వద్ద ఉన్న మంచి నీటి పధకాలను సందర్శించి..నగర వాసులకు రెండు దశాబ్దల క్రితమే తాము కట్టించి,నిర్మించిన మంచి నీటి పథకాలను…ప్రస్తుతం విజయనగరం ప్రజలకు అందకుండా అధికార పార్టీ చేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేసింది..అలాగే అభివృద్ది పనులు ఎక్కడ జరగటం లేదంటూ ఫోటోలను కూడా పత్రికలకు చూపించింది.
సీన్ కట్ చేస్తే.. ..రామతీర్ధం…నెల్లిమర్ల వాటర్ వర్క్క్ ను అలాగే ఆ రెండింటి వద్ద ఉన్న మంచి పధకాలను…జగన్ ప్రభుత్వం ఏ విధంగా వినియోగంలోకి తెచ్చి నగరప్రజల దాహర్తిని తీరుస్తుందో…కళ్లకు కట్టినట్టు ప్రత్యక్షంగా దగ్గరుండీ తీసుకెళ్లి చూపించారు…విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి. మరికొద్ది గంటలలో ఏపీ డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు చేపట్ట నున్న…ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి… తన వయస్సునకు మించి..నీటి పంపుసెట్లను..చంపావదినదివద్ద నిర్మించిన మిని వాటర్ ప్రాజెక్టును…. పరిశీలించడం…నిజంగా అభినంనీయమేనని అంటోంది….సత్యం న్యూస్.నెట్
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం