చెత్త పన్ను విధింపుపై కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఈ మేరకు తమ నిరసన వ్యక్తం చేశారు.
చెత్త పన్ను విధింపు, ఆస్తి పన్ను పెంపు కోసం ప్రభుత్వం విడుదల చేసిన 196 197 198 జీవోలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన తెలియ జేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి తులసి రెడ్డి పాల్గొన్నారు. కడప కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నీలి శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు విష్ణుప్రితంరెడ్డి కార్యదర్శి బండి జకరయ్య, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కోటపాటి లక్ష్మయ్య ,యన్.ఎస్. యూ.ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోజ్జా తిరుమలేష్ , నందలూరు మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు నందలూరు మండల నాయకులు గాలం మధుసూదన్, నార్ల వెంకటేష్ నిరాహార దీక్ష కార్యక్రమము లో పాల్గొన్నారు.