మనీ లాండరింగ్ చట్టం కింద నోటీసులు అందుకున్న బాలివుడ్ నటి ఐశ్వర్యారాయ్ నేడు ఎన్ ఫొర్సుమెంట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. 2016లో సంచలనం సృష్టించిన పనామా పేపర్స్ 11.5 మిలియన్ల రహస్య డాక్యుమెంట్లను లీక్ చేసింది. ఈ రహస్య డాక్యుమెంట్లలో 2,14,488 కంపెనీల అక్రమ లావాదేవీలు ఉన్నాయి. అప్పటి నుంచి ఎన్ ఫోర్సుమెంటు డైరెక్టరేట్ ఈ కంపెనీలపై దర్యాప్తు చేస్తున్నది. ఫెమా నిబంధనలకు విరుద్ధంగా వివిధ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన ఆరోపణలపై ఐశ్వర్యా రాయ్ కి నోటీసులు జారీ చేయగా నేడు ఆమె విచారణకు హాజరయ్యారు. ఆరోపణలపై వివరణ ఇస్తూ ఆమె కొన్ని పత్రాలను అధికారులకు అందచేశారు. దాదాపు నాలుగు గంటల పాటు ఐశ్వర్యా రాయ్ ని అధికారులు ప్రశ్నించారు.