సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం, మండలం లక్కవరం, శ్రీనివాసపురం గ్రామాలలో 25 లక్షల రూపాయల విలువైన సిసి రోడ్డు నిర్మాణానికి నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి శంఖు స్థాపన చేశారు.
ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ టౌన్ కు దగ్గర ఉన్న గ్రామాలలో మౌలిక వసతులు కల్పించడం వలన ఇక్కడి గ్రామాలలోని మహిళలు, యువత చిన్న చిన్న వ్యాపారాలు సాగిస్తూ ఆర్ధికంగా అభివృద్ధి చెందవచ్చని అన్నారు.
త్వరలో అర్హులైన SC,ST,BC లకు కార్పొరేషన్ లోన్లు మంజూరుకు కృషి చేస్తానని,రైతు సమన్వయ సమితుల ద్వారా యువత అత్యధినిక పద్దతులలో వ్యవసాయాన్ని చేసి గ్రామాన్ని అభివృధ్హి పథంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్నారు.
అనంతరం శ్రీనివాసపురం గ్రామంలో రైతువేదిక, ప్రకృతి వనాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి గుడెపు శ్రీను, జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి , మండల పార్టీ అధ్యక్షుడు చావా వీరభద్రా రావు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, MPTC లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.