ఆరేళ్ల బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గుడ్ని నడిరోడ్డు మీద ఉరితీయాలని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇటీవల హైదరాబాదులో అత్యాచారం హత్యకు గురైన బాలిక కుటుంబ సభ్యులను సోమవారం హైదరాబాద్ లో సీతక్క పరామర్శించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ పోలీసుల తీరును ఖండించారు. అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం చేయడం హత్య చేయడం అత్యంత దారుణమని ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదంటే ఇలాంటి దుర్మార్గుల నడి రోడ్డు పై ఉరి తీయాలని ఆమె ఆవేశంగా అన్నారు.
లేదా ఈ దుర్మార్గుడిని ప్రజలకు అప్పజెప్పండి ప్రజలే తగిన శిక్ష విధిస్తారని ఆమె అన్నారు. ఇంకప్పుడైనా ఇలా ఎవరైనా చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.