38.2 C
Hyderabad
April 28, 2024 20: 49 PM
Slider శ్రీకాకుళం

శ్రీకాకుళంలో రెచ్చిపోతున్న ఇసుక బకాసురులు

#ponnadabridge

శ్రీకాకుళంలోని పాత హౌసింగ్ బోర్డు కాలనీలో పొన్నాడ వంతెన వద్ద ఇసుక బండి యజమానులు వంతెన అనుకొని ఉన్న ఇసుకను ఇష్టమొచ్చినట్లు తవ్వుకొని పట్టుకొని పోతున్నారు. కనీసం అధికారులు ఇటు వైపు కన్నెత్తి  చూడకపోవడం విచారకరమని స్థానికులు అంటున్నారు. ఇలాగే ఈ అక్రమంగా ఇసుక తవ్వకం చేపట్టినట్టు అయితే  పొన్నాడ వంతెన కూలిపోవడానికి అవకాశం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా నాటు బండి  యజమానులు వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని పొన్నాడ వంతెన కాపాడాల్సింది గా పొన్నాడ వాసులు కోరుతున్నారు.

Related posts

మునిరాజమ్మకు చంద్రబాబు రూ.5 లక్షల సాయం

Satyam NEWS

కాగజ్ నగర్ లో ఎయిడ్స్ క్యాండిల్ లైట్ ర్యాలీ

Satyam NEWS

చైతన్య కిరణం

Satyam NEWS

Leave a Comment