అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అంబర్ పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి వాణి నగర్ స్థానికంగా ఉన్న డ్రైనేజ్ సమస్యను పరిశీలించి, సంబంధిత వాటర్ వర్క్స్ అధికారి ఏఈ మజీద్ తో మాట్లాడి వెంటనే నూతన డ్రైనేజ్ పైప్ లైన్ పనులను ప్రారంభించాలని స్థానిక బస్తీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. విద్యుత్ దీపాలు పనిచేయనిచోట కొత్తవి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, పాక సంతోష్, శ్రీనివాస్ గుప్తా, వేణు, వంజరి నాగరాజు, గుర్రం సాయి, స్థానిక బస్తీ ప్రజలు శ్రీధర్, శ్రీను, కిషన్, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గ, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్