నిష్కలంక ,నిస్వార్థ ప్రజానేత గా ప్రస్తుత తరం రాజకీయ నేతలకు ఆదర్శప్రాయునిగా మూడు దశాబ్దాల కాలం సిక్కోలు జిల్లా రాజకీయాలను శాసించిన జననేత స్వర్గీయ గొర్లి శ్రీరాములు నాయుడు విగ్రహావిష్కరణ కార్యక్రమం బుధవారం శ్రీకాకుళం నగరంలో కిమ్స్ రహదారిలోఇంటాక్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు, గొర్లి కుటుంబ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా స్వర్గీయ శ్రీరాములు నాయుడు గారి ఆశయాలు..ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్నామని సభలో పాల్గొన్న..నేతలు ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, బెల్లాన చంద్రశేఖర్ లు అన్నారు.