కేంద్రంలోనే మోడీది మేక్ ఇన్ ఇండియా కాదని సేల్ ఇండియా అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండల పరిధిలోని అమరవరం గ్రామంలో జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రతి ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని మాయమాటలు చెప్పి ఉద్యోగస్తులను మోసం చేశారని అన్నారు.
రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి,అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, 57 సంవత్సరాల వారికి పింఛను ఇస్తామని,రైతులకు ఒకేసారి లక్ష రూపాలు ఋణమాఫీ అని మాయమాటలు చెపుతున్నారని,ఆచరణకు నోచుకోలేదని అన్నారు.రాబోయే రోజుల్లో మెరుపై మెరిసేది ఎర్ర జెండా అన్నారు. నిరంతరం పేదల పక్షాన నిలిచేదే ఎర్ర జెండా అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుల నాగారపు పాండు,పల్లె వెంకట్ రెడ్డి, దుగ్గి బ్రహ్మం,యాకోబు,వి.సైదులు, మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్,శాఖ కార్యదర్శి షేక్ ఖాసిం, నాయకులు షేక్ సైదా,సీతారాములు, బాల సైదులు,వీరస్వామి,బుద్ధి,బాల సైదులు, అరవింద్,మహేష్,గోపరాజు, చారి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్