29.7 C
Hyderabad
May 2, 2024 06: 07 AM
Slider చిత్తూరు

నగరిలో క్రీడా సంబరాలను ప్రారంభించిన మంత్రి రోజా

#ministerroja

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ క్రీడా సంబరాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా నేడు ప్రారంభించారు. నగరి డిగ్రీ కళాశాల మైదానం లో SAAP వారి ఆధీనం లోని క్రీడా వికాస మైదానాలు, భవనాలలో సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సమ్మర్ క్యాంప్ లో నూతనంగా నిర్మించిన క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోర్టులను, వాలీబాల్, హ్యాండ్ బాల్, బాల్ బ్యాడ్మింటన్, ఆధునీకరించి న జిమ్, షటిల్ కోర్టులను చిత్తూరు జిల్లా కలెక్టరు హరినారాయణ తో కలసి ఆమె ప్రారంభించారు.

రోజా ఎమ్మేల్యే గా గెలుపొందిన నాటి నుంచి గత 9 సంవత్సరాలుగా నగరి నియోజకవర్గం లోని యువత, విద్యార్థినీ విద్యార్థులను దృష్టి లో ఉంచుకొని మొదటి నుంచి కూడా ప్రతిసారీ ఏదో ఒక రకంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది. నగరి నియోజకవర్గం నుంచి బాల బాలికలు జాతీయ స్థాయి పోటీలలో కూడా గెలుపొందిన సందర్భాలు ఉన్నాయి.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడల ద్వారా యువత, విద్యార్థులు శారీరకంగా మానసికంగా దృఢంగా వుంటారని, మానసిక స్థైర్యం ఏర్పడుతుందని తెలిపారు. కులాలు, మతాలు కు సంబంధం లేకుండా అందరూ  కలిసి కట్టుగా పాల్గొనే ఒకే ఒక్క ప్రధానమైన అంశం ఈ స్పోర్ట్స్ మాత్రమే అని మంత్రి రోజా తెలిపారు.

క్రీడలను ఆడడం ద్వారా ఆరోగ్యం,సంతోషం మాత్రమే కాకుండా మెడల్స్, అవార్డులు, ప్రైజస్ లాంటి గుర్తింపు పథకాలు కూడా లభిస్తుందని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత స్పోర్ట్స్ కోటా లో 2500 మంది ఉద్యోగాలు పొందారని మంత్రి తెలిపారు.

రాష్ట్రం నుంచి  అంతర్జాతీయ స్థాయి కి వెళ్ళిన  క్రీడా కారులకు సుమారు 4.7 కోట్ల రూపాయలను వెచ్చించారని తెలిపారు. అదేవిధంగా ప్రముఖ షటిల్ క్రీడాకారుడు స్పోర్ట్స్ అకాడమీ నిర్వహించడానికి  5 ఎకరాలు స్థలాన్ని మంజూరు చేశారని చాలా మందికి జాబ్స్ కూడా ఇప్పించారని తెలిపారు.

గ్రామీణ స్థాయిలో పిల్లలకు చక్కని ఆరోగ్యం కల్పించడానికి, ఎవరు బాగా గ్రామ స్థాయి లో ఆడుతారో వారిని గుర్తించి క్రీడాకారులు గా తీర్చిదిద్దడానికి ఫిజికల్ డైరెక్టర్లు ప్రతి సచివాలయం పరిధి లో ఉన్న బాల బాలికల క్రీడా నైపుణ్యాలను గుర్తించి వారికి అవకాశాలు కల్పించడానికి తగిన కృషి చేయాలని తెలిపారు.

ఆడాలని ఉన్న ప్రతిఒక్కరికీ గ్రౌండ్ మరియు క్రీడా పరికరాలు వసతులను కల్పిస్తున్నామని మంత్రి రోజా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1769 సమ్మర్ క్యాంపులు జరుగుతున్నాయని తెలిపారు. నగరి లో సుమారు  20 నుంచి 25 రోజుల వరకు ఈ సమ్మర్ క్యాంప్ జరుగుతుంది.

ఈ ఇరవై రోజులు మాత్రమే కాకుండా తరువాత కూడా ఛాంపియన్స్ కావాలనుకుంటే వారికి ఏడాది పూర్తిగా కూడా సరైన సహకారం ఉంటుందని, దీనికి ఫిజికల్ డైరెక్టర్లు సపోర్ట్ చెయ్యాలని, ప్రజా ప్రతినిధులు అందరినీ కూడా ఉదయం మరియు సాయంత్రం వచ్చి పిల్లలను ఆడించడానికి ప్రోత్సాహం చేయాలని మంత్రి కోరారు.

అలాగే శిక్షణ పొందిన వారికి SAAP తరపున సర్టిఫికెట్స్ కూడా మంజూరు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం లో చిత్తూరు జిల్లా కలెక్టరు తో బాటు జిల్లా క్రీడా శాఖా అధికారులు పాల్గొన్నారు.

Related posts

బాసర గంగపుత్రుల ఆధ్వర్యంలో గురుపౌర్ణమి

Satyam NEWS

బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణంతో నూతన శకం

Satyam NEWS

సూర్యాపేట జిల్లాలో భారీగా నకిలీ విత్తనాల పట్టివేత

Satyam NEWS

Leave a Comment