భూ సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు అధికారులు వ్యవహరిస్తున్నతీరును ఖండిస్తూ మావోయిస్టు పార్టీ పేరిట కాగజ్నగర్ పట్టణ కేంద్రంలో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. కొత్త రెవెన్యూ చట్టాలను ఆసరాగా చేసుకుంటున్నకొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారి పైన భూములు మార్చకుండా పాతవారిని కొనసాగిస్తూ కావాలనే కొంతమంది అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు తమ తీరు మార్చుకోకపోతే సరైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్నపోలీసులను అక్కడికి చేరుకుని వాటిని తొలగించారు. ఈ సంఘటనపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.