ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హత్య కేసులలో ప్రధాన నిందితుడుగా వున్న మోస్ట్ వాంటెడ్ కాంట్రాక్ట్ కిల్లర్ తప్పించుకుని ఆంధ్రపదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో తిరుగుతున్నాడన్న సమాచారం మేరకు ఉత్తరాఖండ్ రాష్ట్ర స్పెషల్ టాస్క్ ఫోర్సు పోలీస్ వారు ఎన్.టి.ఆర్.జిల్లా నగర పోలీసుల సాయం కోరారు.
ఈ నేపధ్యంలో నగర పోలీసు కమీషనర్ కాంతి రాణా టాటా అదేశాల మేరకు టాస్క్ ఫోర్సు ఏ.డి.సి.పి. కె. శ్రీనివాసరావు పర్యవేక్షణలో, టాస్క్ ఫోర్సు ఏ.సి.పి. జి.వి. రమణ మూర్తి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్సు ఎస్.ఐ. ఆర్.ఏం.వి.పురుషోత్తం, హెడ్ కానిస్టేబుల్ నాగ మల్లేశ్వర రావు, పోలీస్ కానిస్టేబుల్లు రామకృష్ణ, నాగారాజులతో కలిసి ఒక బృందంగా ఏర్పడి నిఘా ఏర్పాటు చేశారు.
మోస్ట్ వాంటెడ్ కాంట్రాక్ట్ కిల్లర్ ను గుర్తించి, అదుపులోనికి తీసుకుని ఉత్తరాఖండ్ రాష్ట్ర స్పెషల్ టాస్క్ ఫోర్సు పోలీస్ వారికి అప్పగించారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ రాష్ట్ర స్పెషల్ టాస్క్ ఫోర్సు పోలీస్ వారు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రశంసాపత్రాలతో అభినందించారు.
ఉత్తరాఖండ్ రాష్ట్ర స్పెషల్ టాస్క్ ఫోర్సు పోలీస్ పంపిన లేఖలను క్రైమ్ ఏ.డి.సి.పి. (ఇన్ ఛార్జ్ అడ్మిన్) పి. వెంకటరత్నం మోస్ట్ వాంటెడ్ కాంట్రాక్ట్ కిల్లర్ ను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన అధికారులను అందచేశారు.