కరోనా వైరస్ కోవిడ్-19 దెబ్బకు ఆసుపత్రిలో వైరస్ బారిన పడ్డ రోగులకు సేవలందించిన ఒక డైరెక్టర్ మృతి చెందాడు.కోవిడ్-19 కు కేంద్రంగా మారిన వుహాన్లో ఈ వ్యాధి సోకి ఓ ఆసుపత్రి డైరెక్టర్ మరణించారు. ఈ వ్యాధి బారిన పడి వుహాన్లోని వుచాంగ్ హాస్పిటల్ డైరెక్టర్ లియు జిమింగ్ మంగళవారం మరణించారు.
అయితే అతనిని రక్షించడానికి ఆసుపత్రి వైద్యులు చేసిన అన్ని ప్రయత్నాలు ఫలితం లేకుండా పోయింది. లియు జిమింగ్ కరోనావైరస్ వల్ల చనిపోయిన మొదటి ఆసుపత్రి డైరెక్టర్. కాగా ఈ వైరస్ బారిన పడి ఇప్పటికి ఆరుగురు వైద్యలు మరణించారు.