కృష్ణా జిల్లా కొండపల్లి లో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్నది ఒక తల్లి. లావణ్య అనే ఆమె తన మూడు సంవత్సరాల బాబు, ఏడాది వయస్సున్న పాపకు విషం ఇచ్చి చంపింది.
ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నది.
కొండపల్లి మటన్ మార్కెట్ సమీపంలో జరిగిన ఈ ఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది. అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసి పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.