మదర్ థెరీసా 111వ జయంతి కార్యక్రమాన్ని హైదరాబాద్ ముంజా మార్కెట్, రెజిమెంటల్ బజార్ లో ఘనంగా నిర్వహించారు. ముంజా మార్కెట్ టిడిపి డివిజన్ అధ్యక్షులు గౌరిశంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
మదర్ థెరీసా జయంతి కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి కుమారి ఇందిర, తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి సుర్యదేవర లత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ మానవాళికి దేవుడు అందించిన వరం మదర్ థెరీసా అని అన్నారు. ఆమె చూపిన బాటలో అందరూ నడిచినప్పుడే మానవత్వం పరిమళిస్తుందని ఆమె అన్నారు.