38.2 C
Hyderabad
April 29, 2024 19: 50 PM
Slider మహబూబ్ నగర్

దళిత నాయకుడైన మోత్కుపల్లి ఆత్మ విమర్శ చేసుకోవాలి

#bhaskar

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెప్పు కోసం సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తహతహలాడుతున్నారని యువజన కాంగ్రెస్, ప్రధాన కార్యదర్శి దారా భాస్కర్ ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ పార్టీ గాని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గాని దళిత బంధు పథకానికి వ్యతిరేకం కాదు అని ఇప్పటికే వంద సార్లు స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు.

కానీ దళితులను కేవలం ఓట్ల కోసం వాడుకొని ఎన్నికల తరువాత మోసం చేసిన సంఘటనలు మోత్కుపల్లి నర్సింహులు దళిత బంధు చైర్మన్ కాగానే మర్చిపోయినట్టు ఉన్నారని భాస్కర్ అన్నారు. పదవి కోసం పాకులాడే మోత్కుపల్లి లాంటి నాయకులు రేవంత్ రెడ్డి ని, కాంగ్రెస్ పార్టీని  విమర్శలు చేసే ముందు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన కోరారు.

కాంగ్రేస్ పార్టీ దళిత గిరిజన, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో చట్టాలు రూపొందించింది. అందులో భాగంగానే భూ సంస్కరణల ద్వారా పేదలకు భూములు పంచితే తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం వచ్చినక దళితులు గిరిజన భూములు గింజుకుంటుంటే మోత్కుపల్లి కి కనిపించడం లేదా? మీకు చైర్మన్ పదవి రాగానే కేసీఆర్ దళితులకు చేసిన అన్యాయాలు, అక్రమాల నుండి పుణ్యన్ముడు అయ్యాడా???? అని భాస్కర్ ప్రశ్నించారు.

Related posts

సీఎం జగన్ పర్యటనకు 2000 మంది తో పట్టిష్టమైన భద్రత…!

Satyam NEWS

నారాయణ పరివారానికి ముందస్తు బెయిల్ మంజూరు

Satyam NEWS

తిరుమల  ఘాట్ లో ఎలక్ట్రిక్ బస్సు ట్రయల్ రన్

Satyam NEWS

Leave a Comment