చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ మరియు బెర్కాడియా సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. బెర్కాడియా సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హ్యూమన్ రిసోర్సెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దేబాశిష్ ఘోష్, సిబిఐటి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి ఈ అవగాహన ఒప్పందం పైన సంతకాలు చేశారు.
సీబీఐటి – ఎస్ఎమ్ఎస్ విభాగ అధిపతి డాక్టర్ ఎస్ సరస్వతి ఈ అవగాహన ఒప్పందం ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఇంటర్న్షిప్, ప్లేస్మెంట్లు, పరిశ్రమలు కావలసిన శిక్షణ విద్యార్థులకు బెర్కాడియా సర్వీసెస్ ఆందజేస్తారని తెలిపారు. ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ డైరెక్టర్ యుకె చౌదరి, బెర్కాడియా సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ జయకర్, కోఆర్డినేటర్ డాక్టర్ దమన్ జీత్, ఎస్ఎంఎస్ సిబ్బంది డా.టి.ఎస్.పూర్ణచంద్రిక, వి.బి.కె.రావు, తులసీరామ్ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.