నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో లాక్ డౌన్ సందర్భంగా రైతులకు అండగా ఉండడం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఇంట్లోనే రైతు సంక్షేమ దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిరియాల శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పంటల సేకరణ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
జిల్లా వ్యాప్తంగా దాన్యం కొనుగోలు కేంద్రాలలో గన్ని బ్యాగులు కొరత ఏర్పడడంతో ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుందని దీనితో అకాల వర్షాల వల్ల తీవ్రంగా రైతులు నష్టపోతున్నారని, అయినా అప్పటికి ప్రభుత్వం సరైన దిశగా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు