నెల్లూరు గ్రామ దేవత, ఇరు కళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు మెండుగా అందాలని ఆకాంక్షించారు. 41వ డివిజన్ కార్పొరేటర్ కె. విజయలక్ష్మి ,వారి మిత్రమండలిచే ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటయింది.
ఎంపీ ఆదాలకు దేవస్థానం చైర్మన్ ఆర్.ఎస్.ఆర్ స్వాగతం పలికారు. డిసిసిబి మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, వైసీపీ నేతలు కోటేశ్వర్ రెడ్డి, హరిబాబు యాదవ్, పాముల హరిప్రసాద్, సుధాకర్ యాదవ్, నవీన్ కుమార్ రెడ్డి, అల్లా బక్షు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.