కరోనా నుండి కోలుకున్న రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు, ఆయన సతీమణి వొడితల సరోజినీదేవి దంపతులను హనుమకొండ లోని వారి నివాసంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్బంగా సంతోష్ వెంట ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దివ్యంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్ రావు తదితరులు ఉన్నారు.
ఈ సందర్బంగా పలు అంశాలపై వారు చర్చించారు. కెప్టెన్ కుటుంబ సభ్యుల యోగ క్షేమాల గురించి ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అడిగి తెలుసుకున్నారు.