38.2 C
Hyderabad
May 1, 2024 23: 02 PM
Slider మెదక్

నాలుగు నెలల్లో ముదిరాజ్ కమ్యూనిటీ బిల్డింగ్ నిర్మాణం పూర్తి

#ministerharishrao

సిద్దిపేట లో వచ్చే 4 నెలల్లో ముదిరాజ్ కమ్యూనిటీ బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట పురపాలక సంఘం పరిధిలోని THR నగర్ లో దాదాపు 2 ఎకరాలలో రూ.5 కోట్ల 20 లక్షలతో G+1 విధానంలో నిర్మాణంలో ఉన్న ముదిరాజ్ AC కమ్యూనిటీ బిల్డింగ్ ను మంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

పనులు ఆశించిన వేగంగా జరగడం లేదన్నారు. ముదిరాజ్ AC కమ్యూనిటీ బిల్డింగ్ నిర్మాణం కు మొదట రూ.2 కోట్లతో మంజూరు చేశామని మంత్రి తెలిపారు. ఆ నిధులు సరిపోక పోవడంతో మళ్ళీ రూ.3 కోట్ల 20 లక్షలు మంజూరు చేశామని, మొత్తం 5 కోట్ల 20 లక్షలతో ముదిరాజ్ AC కమ్యూనిటీ బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నామని మంత్రి తెలిపారు.

వీటిలో రూ.70 లక్షలు ఫంక్షన్ హల్ లో ఏసీ కోసం, రూ.50 లక్షలు ప్రవారీ నిర్మాణం కోసం వెచ్చించాలని మంత్రి తెలిపారు. అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తామని మంత్రి అన్నారు. ఫంక్షన్ హల్ కు చెందిన ఎకరం స్థలం ను పార్కింగ్ కు అనువుగా తీర్చిదిద్దాలని అన్నారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని మంత్రి మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

Related posts

ఎలర్ట్: కరోనాపై అన్ని జిల్లాలలో అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసు తనిఖీలు

Bhavani

అధోగతి పాలైన ఆంధ్రప్రదేశ్ ను కాపాడాల్సిన అవసరం ఉంది

Satyam NEWS

Leave a Comment