బాసర నుండి హైదరాబాద్ కు మహాపాద యాత్ర ప్రారంభం
రాజకీయంగా,సామాజికంగా వెనుకబడిన ముదిరాజులు రాజకీయంగా చైతన్యం పొంది రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. బొజ్జనరాయణ ముదిరాజ్,ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సలెందర్ శివయ్య ముదిరాజ్ లు పిలుపునిచ్చారు.
ఈ మేరకు శుక్రవారం శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయం నుండి హైద్రాబాద్ లోని పెద్దమ్మతల్లి ఆలయం వరకు సుమారు 250 కీమీ దూరం వరకు ముదిరాజ్ విజన్ యూ ట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు,జైముదిరాజ్ సినిమా నిర్మాత వరుణ్ తేజ ముదిరాజ్ చేపట్టిన మహాపాదయాత్రను ముదిరాజ్ మహాసభ నేతలు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జెండా ఊపి ప్రాంభించారు.
ఈ సందర్బంగా ముదిరాజ్ మహాసభ నేతలు బొజ్జనరాయణ, శివయ్య తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ని బిసి కులల్లో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ లు చట్ట సభలకు దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 40 శాసనసభ నియోజకవర్గ పరిధిలో గెలుపు ఓటములను ప్రభావితం చేయడం తో పాటు25 నియోజకల్లో ఇతర సామాజిక వర్గాల మద్దతుతో విజయం సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ పాలక వర్గాలకు ఓటు బ్యాంకులుగా ఉన్నారు తప్ప ఎన్నికల్లో పోటీచేయలేని స్థితికి నెట్టి వేయబడ్డారని అన్నారు.
భారత రత్న అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన అంటే దామాషా పద్దతిలో సీట్లు కేటాయిస్తే ముదిరాజ్ లకు ప్రస్తుత అసెంబ్లీలో 15 నుండి 20 అసెంబ్లీ సీట్లు దక్కాలి కానీ అది జరగడం లేదన్నారు.గతం లో 8నుండి 10 మంది ఎమ్మెల్యే లు ఉంటే ఆ సంఖ్య ఒకటి పడిపోగా ఇటీవల ఒక ఎమ్యెల్సి పదవి ఇచ్చారని వీటి వల్ల ముదిరాజ్ జాతికి ఏ మాత్రం ఉపయోగం లేదన్నారు.
రాబోయే రోజుల్లో ముదిరాజ్ లకు ఆయా రాజకీయ పార్టీలు అధికంగా సీట్లు కేటాయించే విదంగా ముదిరాజులు ఐక్య పోరాటాలకు సిద్ధమై రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డా. బండప్రకాశ్ ముదిరాజ్,డా. చొప్పరిశంకర్ ముదిరాజ్, రొటం భూపతి,గ్రేటర్ అధ్యక్షులు పోల్కం లక్ష్మీనారాయణ ముదిరాజ్ ల న్యాయాకత్వం లో ముదిరాజులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ముదిరాజ్ మహాసభ నాయకులు ముథోల్ మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ అనిల్ కుమార్ ముదిరాజ్,ఉద్యోగుల సంఘం నాయకులు వన్నెబొయిన చిన్నయ్య ముదిరాజ్, ధర్మపురి బోజన్న,పండరి, ప్రశాంత్ ముదిరాజ్,బోయిన్ వాడ్ సతీష్,బల్ల అంజన్న ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.