ములుగు జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్ పి గౌస్ ఆలం నేడు మేడారం వన దేవతలను దర్శించుకున్నారు. ఆయనతో బాటు OSD అశోక్ కుమార్, ASP ఏటూరునాగారం సిరిశెట్టి సంకీర్త్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మినీ మేడారం జాతర ప్రారంభమౌతున్న నేపథ్యంలో ములుగు జిల్లా ఎస్. పి వనదేవతలను సందర్శించుకోవడమే కాకుండా అక్కడి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వన దేవతలను సందర్శించడం పట్ల ఎస్ పి గౌస్ ఆలం ఆలయ పూజారులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో జాతర పనులను పర్యవేక్షించి తగు సూచనలను సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, క్యూ లైన్ వద్ద తగు జాగ్రత్తలు, అధికారులకు సిబ్బందికి వసతి, పార్కింగ్ స్థలం వంటి అంశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమం లో సి. ఐ పస్రా శంకర్, ఎస్. ఐ పస్రా కర్ణాకర్ రావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
previous post
next post