భారతదేశంలో జన్మించి, ఇక్కడ ఆహారం తింటూ, ఇక్కడి నదుల నీరు త్రాగేవారు అందరూ హిందువులే అని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అన్నారు. కేరళలో ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనం సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ వ్యవస్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మాటలను గుర్తు చేశారు. ఒక దశాబ్దం క్రితం ఆర్యసమాజ్ సమావేశంలో తనను తాను హిందువునని చెప్పుకోవాలని పట్టుబట్టినట్లు సర్ సయ్యద్ ఖాన్ చెప్పిన మాటలను ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఉటంకించారు. హిందు అనేది మతపరమైన పదం కాదని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ లానే తాను కూడా విశ్వసిస్తున్నారని కేరళ గవర్నర్ అన్నారు.
ఆయన దానిని ఈ ప్రదేశానికి సంబంధించిన పదంగా పరిగణించారు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఇంకా పలు విషయాలు చెప్పారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆర్యసమాజ్ వారితో మాట్లాడుతూ భారతదేశంలో జన్మించిన వారు ప్రతి ఒక్కరూ హిందువు అని పిలవడానికి అర్హులు అని ఆయన అన్నట్లు చెప్పారు. బ్రిటిష్ వారు పౌరుల సాధారణ హక్కులను నిర్ణయించడానికి కమ్యూనిటీలను ప్రాతిపదికగా చేసుకున్నందున వలసరాజ్యాల కాలంలో హిందూ, ముస్లిం మరియు సిక్కు వంటి పదాలను ఉపయోగించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వి మురళీధరన్ కూడా పాల్గొన్నారు. స్వాతంత్య్రానికి ముందు కూడా సనాతన ధర్మాన్ని విశ్వసించిన రాజులు, పాలకులందరూ అన్ని మత సమూహాలను హృదయపూర్వకంగా అంగీకరించారని అన్నారు.