ములుగు జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటిగా అన్ని హంగులతో తీర్చి దిద్దుతానన్న రాష్ట్ర మునిసిపల్ వ్యవహారా శాఖ మంత్రి కేటిఆర్ కు ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ ములుగు జిల్లాకు సముచిత స్థానం కల్పించడం హర్షణీయమని ఆయన అన్నారు. ఆదివాసీ జిల్లా అయిన ములుగు జిల్లాకు తన శాఖ పరంగా నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం మంత్రి కేటీఆర్ కే సాధ్యమైందని ఆయన అన్నారు.
పోడు భూముల సమస్యల పరిష్కారానికి ములుగు జిల్లా పరిష్కార వేదికగా మారనుందని, వెనుకబడ్డ ఆదివాసీ అయిన ములుగు జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల కూడా ఏర్పాటు చేయడం, డిజిటల్ హెల్త్ ప్రోఫైల్ పాయిలెట్ ప్రాజెక్టులో సిరిసిల్ల జిల్లాతో సమానంగా ములుగు జిల్లాకు ప్రాధాన్యం కల్పిస్తూ ఇక్కడ కూడా హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు ఏర్పాటుచేయడం, ములుగు జిల్లాపై ముఖ్యమంత్రి కేసిఆర్ కు ఉన్న ప్రేమను తెలియజేస్తుందని ఆయన అన్నారు. రాబోవు రోజులలో ములుగు జిల్లాకు ముఖ్యమంత్రి కేసిఆర్ సమగ్ర అభివృద్ది కోసం వరాల జల్లు కురిపియనున్నారని ఈసందర్బంగా జడ్పీ చైర్మన్ తెలిపారు.