29.7 C
Hyderabad
May 2, 2024 04: 12 AM
Slider ముఖ్యంశాలు

మలిదశ తెలంగాణ ఉద్యమనేత ఆకస్మిక మరణం

#MuluguZPChairmen

ములుగు జడ్పీ కార్యాలయం సీసీ సాదుల ప్రసాద్ కు కన్నీటి వీడ్కోలు తెలిపారు. ఈరోజు ఉదయం సుమారు రెండు గంటల ప్రాంతంలో గుండె పోటుతో ములుగు జడ్పీ కార్యాలయ సీసీ సాదుల ప్రసాద్ మరణించారు.

ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ అంతిమ యాత్ర లో పాల్గొన్నారు. ప్రసాద్ మరణ వార్త విని కుసుమ జగదీష్ దిగ్భ్రాంతికి గురయ్యారు. వారి ఇంటికి వెళ్లి పార్థివ దేహానికి నివాళి అర్పించారు.

తన చిన్ననాటి మిత్రుడిని కోల్పోవడంతో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో నాటి నుంచి జడ్పీ ఛైర్మన్ అయిన ఈరోజు వరకు అనేక విషయాలను గుర్తు చేసుకొని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ బాధకు లోనయ్యారు.

వారి అంతిమ యాత్రలో  వరంగల్ పశ్చిమ శాశన సభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారునికి జోహార్లు అర్పించి కన్నీటిపర్యంతం అయ్యారు.

Related posts

గోశాల ఆవులను కబేళాకు తరలిస్తున్న ముఠా

Satyam NEWS

జగన్ కు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేదు

Satyam NEWS

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 371 జయంతి

Satyam NEWS

Leave a Comment