వనపర్తి పట్టణంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల మురికి ప్రగతి పథంలో ఉంది. దోమల బెడద పెరిగింది. రోగాలు పెరిగాయి. మునిసిపాలిటీపై సమీక్ష చేయడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారు. వనపర్తిలోని రామా టాకీస్ ప్రక్కన వాగు కాల్వ దుర్గంధంలో ఉంది. కాల్వను శుభ్రం చేయలేదు. ప్రతి రోజు అధికారులు మురికి కాల్వ ప్రక్క నుండి వెళుతున్నారు. కానీ కాల్వను పట్టించుకోరు. వనపర్తిలోని పాత బస్టాండు ప్రక్కన మూత్రశాలలు దుర్గందంగా ఉన్నాయి. మూత్రశాలల గురించి పత్రికలలో వార్తలు వచ్చినా అధికారులు పట్టించుకోలేదు. నీటితో శుభ్రం చేయడం లేదు. నీరు వున్నా నీటిని వదలడం లేదు. ప్రతి నెల వేతనం,వాహనం సౌకర్యం పొందుతున్న అధికారులు సందర్శించడం, తనిఖీ చేయడంలో విఫలమయ్యారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్