ఏపీ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి.. తనదైన శైలి లో కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పూసపాటి అశోకగజపతి రాజుపై మరో సారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా కు క్యాన్సర్ హాస్పిటల్ కోసం ఆందోళన చేస్తున్న లోక్ సత్తా పార్టీ నేత భీశెట్టి బాబ్జీ కి సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన స్థానిక నేత 17 సార్లు రాష్ట్ర మంత్రి గా..5 సార్లు కేంద్ర మంత్రి గా ఉన్నారని అప్పుడు అశోక్ గజపతిరాజు… ఏం చేసారని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ప్రశ్నించారు.
ఈ మేరకు విజయనగరం లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయం పై మాట్లాడారు. ఆయనకు అహం…కోపం తో పాటు తానే ఎదగాలని… తాను మాత్రమే ఉన్నత స్థానంలో ఉండాలనే వ్యక్తి అశోక్ గజపతి రాజు అని డిప్యూటీ స్పీకర్ విమర్శించారు. తాను మాత్రం ప్రజల మధ్యనే ఉంటున్నానని…అర్ధరాత్రి అయినా పిలిస్తే పలికే వ్యక్త అని…అదే నన్ను ఈ ఉన్నత స్థాయికి చేర్చిందన్నారు.
ఇక నారా లోకేష్ పాదయాత్ర… చేస్తే…ఆయనకు పేరేమో గాని అటు ఆ పార్టీ కి గాని ఇటు రాష్ట్రానికి గాని ఒరిగిందేమీ లేదని ఆయన అన్నారు. పోలీసుల బందోబస్తు ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని…ఆయన చేపట్టిన యువగళంలో ఏదైనా జరిగితే ఆయనే బాధ్యత వహించాలని డిప్యూటీ స్పీకర్ అన్నారు. నాకు ప్రభుత్వం కల్పించిన ప్రోటోకాల్ విషయంలో తాను ఎక్కడకు వెళుతున్నానో..పోలీసు అధికారులకు చెప్పి..ముందు ఒకరు వెనుక ఒకరు ఉండాలని.. చెబుతున్నానని…ప్రభుత్వం కల్పించిన…ఇచ్చిన భద్రత ను…నా అధికారిక కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగిస్తున్నానని చెప్పుకోచ్చారు…డిప్యూటీ స్పీకర్ కోలగట్ల.
చివరి లో మీడియా సమావేశం కు వచ్చిన ప్రతీ ఒక్కరినీ అడిగి తెలుసుకుని..పరిచయం చేసుకుని…భరత్ చాలా సీనియర్ రిపోర్టర్ అని మీడియా ముఖంగానే చెబుతూ…ప్రస్తుతం “సత్యం న్యూస్. నెట్” లో పని చేస్తున్నానని ప్రత్యేకించి అడిగి తెలుసుకుని…అభినందించారు.