అన్నమయ్య జిల్లా రాజంపేట డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికుల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీ మునిసిపల్ వర్కర్స్,ఎంప్లాయిస్ యూనియన్ అనుబంధ సంఘాల నేతల పిలుపు మేరకు ఈ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు.ఈ సందర్భంగా వారు సీఐటీయూ నేతలతో కలిసి ఆర్.అండ్.బి.బంగ్లా వద్ద అంబెడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.న్యాయ బద్ధమైన తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
previous post