సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వరా హాస్పిటల్ లో మహిళకు ఆపరేషన్ కొరకు ‘బి’పాజిటివ్ రక్తం అత్యవసరంగా కావాలని నిజామ్ జనచైతన్య ట్రస్ట్ ను సంప్రదించగా ట్రస్ట్ నిర్వాహకులు పినపారాళ్ళ వంశీ, పారా సాయి,శివశంకర్ లు తక్షణమే స్పందించి డోనార్స్ తో మాట్లాడి పంపిస్తామని ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పినపారాళ్ళ వంశీ తరుణ్ తో మాట్లాడి కోదాడ తిరుమల బ్లడ్ బ్యాంక్ వద్దకు పంపించి ‘బి’ పాజిటివ్ బ్లడ్ రక్తదానం చేయడం జరిగింది.జనచైతన్య ట్రస్ట్ తరుపున 356వ, వ్యక్తికి రక్తదానం చేసిన తరుణ్ ని ట్రస్ట్ సభ్యులు అభినందించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పినపారాళ్ళ వంశీ మాట్లాడుతూ రక్తం అవసరం వున్నా ప్రతి ఒక్కరికి జన చైతన్య ట్రస్ట్ అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది అని తెలిపారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని కోరారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్