మున్నూరు కాపులు రాజ్యాధికారం సాధించాలని హుజూర్ నగర్ మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కోలా నాగేశ్వరరావు అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కోలా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యునిగా మున్నూరు కాపు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వద్దిరాజు రవిచందర్ ను సిఎం కెసిఆర్ ఎంపిక చేయటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈనెల 18న, సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంపీ రవిచందర్ కు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు చేయనున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు.మున్నూరు కాపు కులస్తులు అందరూ సూర్యాపేట జిల్లా కేంద్రానికి భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు నాగసైదులు, కామిశెట్టి వెంకటేశ్వర్లు,కాకర్ల నాగేశ్వరరావు,సత్తిబాబు,పెద్ద వెంకటేశ్వరరావు,వెంకటయ్య,సతీష్, వీరస్వామి,పంతులు నాగేశ్వరరావు, బిక్షం, నాగేశ్వరరావు, శ్రీను,అశోక్,గిరి, యలమందయ్య తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్